అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దీరజ్ శనివారం తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.