తిరుపతి జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో ఒక స్లీపర్ బస్సు స్వాధీనం చేసుకుని, 40 వాహనాలపై కేసులు నమోదు చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, ప్రజలు, వాహన యజమానులు రవాణా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ కోరింది.