TG: అమెరికాలో వరంగల్కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ నగరం రామనాథపురి కాలనీకి చెందిన రాకేశ్(40) అమెరికాలో గుండెపోటుతో మరణించారు. రాకేశ్ ఉద్యోగ రీత్యా పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.