VKB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఇకనుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి గత కొన్ని వారాలుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున నిలిపివేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.