WGL: ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. నగరంలోని భద్రకాళి ఆలయం ఆర్చి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజేంద్రప్రసాద్, గడ్డం రాకేష్, అభిలాష్, అనుదీప్ తదితరులున్నారు.