ADB: పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్కి చెందిన ఇద్దరు నిందితులు మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ SI విష్ణువర్ధన్ తెలియజేశారు. నిన్న సిబ్బందితో సమావేశమై వివరాలను వెల్లడించారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.