MBNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజాపూర్ మండల కేంద్రంలోని నర్సరీని అధికారులు, సర్పంచ్ కావలి రామకృష్ణ శనివారం పరిశీలించారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవి ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.