VSP: ఆనందపురం మండలం బోయిపాలెం వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కొట్టా అప్పారావును ఆనందపురం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో కుడి భుజం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.