KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు శనివారం తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.