ADB: ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. నమోదైన ప్రతి ఫిర్యాదుపై అధికారులు 30 రోజుల్లోగా పరిష్కార నివేదిక సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.