GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 61 మందికి రూ. 46,59,619ల విలువైన చెక్కులను శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.