SKLM: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాఫూలే 200వ జయంతి వేడుకలను ఈ నెల 11న జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. శనివారం ఉ.10 గం.లకు నగరంలోని పొన్నాడ వంతెన సమీపంలో ఉన్న ఫూలే పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు.