కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలమానీ అరెస్ట్ అయ్యారు. రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలను కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.