KMR: నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సర్పంచులకు రేపు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DPO మురళి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం, సర్పంచుల విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.