MDK: నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధార్ సెంటర్ ఏర్పాటు కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఆధార్ అప్డేట్స్, కొత్త కార్డుల కోసం దుబ్బాక, రామాయంపేట, మెదక్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.