NLG: చిట్యాల మండలం ఏపూరిలో ఆకస్మికంగా మృతి చెందిన ఎరసాని కృష్ణయ్య కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెం కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. మృతదేహానికి ఇవాళ పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు ఎల్లయ్యను పరామర్శించారు. వీరితో పాటు లింగస్వామి, నరసింహ పాల్గొన్నారు.