BDK: టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఐటీడీఏ ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక పాఠశాల ఆవరణంలో నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.