NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం ఏర్పాట్లను విగ్రహ కమిటీ నాయకులు పరిశీలించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్తో పాటు కన్వీనర్ లక్ష్మణ శర్మ, సదానందం గౌడు, జంగయ్య, జూపల్లి రాములు, శేఖర్, వీరస్వామి, జగన్ తదితరులు ఏర్పాట్లు సమీక్షించారు.