ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు అన్నారు. మంప ఎస్సై సీదరి శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన రాజేంద్రపాలెం వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. వాటికి దూరంగా ఉండాలన్నారు.