PDPL: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నట్లు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 97 కు పెంచడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను, గ్రామస్తులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.