SRD: కంగ్టిలో సిద్దేశ్వరుడి జాతరకు మహారథం సిద్ధమవుతోంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా జాతరకు వారం రోజులు ముందుగానే రథాన్ని తయారు చేసే పనులు చేపడతారు. వచ్చే వారంలో శిఖరోత్సవం, అగ్నిగుండాలు రథోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. మండల ప్రజలే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు.