WGL: భద్రకాళి ఆలయం ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం భక్తులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.