TG: ఇవాళ ఉభయసభల ముందు కాగ్ నివేదిక పెట్టనున్నారు. మార్చి 2022 ఏడాది కాగ్ నివేదికలను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సామాజిక, ఆర్థిక, సాధారణ రంగాలు, స్థానిక సంస్థలపై కాగ్ నివేదిక ఇచ్చింది. భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమంతో పాటు.. మార్చి 2023 ఏడాదికి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై.. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర లెక్కలపై కూడా కాగ్ నివేదిక పొందుపర్చింది.