AKP: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వస్తున్న ‘వీబీ జీ రామ్ జీ’ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు సూచించారు. అనకాపల్లి మండలం గొలగాంలో ఆదివారం వేతనదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూలీలకు కొత్త పథకం ద్వారా 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు.