KDP: మైదుకూరు మండలం నంద్యాలంపేట సమీప పొలాలలో విద్యుత్ స్తంభాలు ఒరిగి కూలిపోయేలా ఉన్నాయి. తీగలు కూడా కిందకు వేలాడుతూ ప్రమాదాలకు ఆస్కారం ఉండేలా కొనసాగుతున్నాయని రైతులు అంటున్నారు. పొలంలో పనులు చేసుకోవాలన్న ప్రమాదాల భయం తమను వెంటాడుతోందని రైతులు అన్నారు. విద్యుత్ అధికారులు ఇటువంటి స్తంభాలను గుర్తించి బాగు చేయాలని కోరారు.