NLR: చిట్వేలి – రాపూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. చిట్వేలి ఏఎస్ఐ వెంగయ్య తెలిపిన వివరాల మేరకు గూడూరు నుంచి వేంపల్లికి నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డులోని కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. నిమ్మకాయల యజమాని లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.