ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. 547 సర్వే నంబరులో అర్హులైన మాదిగలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నాయకుడు అంజన్న ప్రసాద్ డిమాండ్ చేశారు. పేదలకు గృహవసతి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్కు అందజేశారు.