NDL: బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. వాహనాల్లో హై ఇంటెన్సిటీ లైట్ల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. రాత్రివేళల్లో ఇవి ఎదురుగా వచ్చే వారికి ఇబ్బందులు కలిగించి ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయని ఇవాళ హెచ్చరించారు.