NLG: నాంపల్లిలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగుల తాకిడి పెరుగుతున్నా, సిబ్బంది కొరత, మందుల లేమి రోగులకు శాపంగా పరిణమించాయి. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి హామీ ఇప్పటికీ కార్య రూపం దాల్చకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.