BDK: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. భద్రాద్రి కరకగూడెం లో 41.8 నమోదయింది.