BDK: కొత్తగూడెం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ.. వెన్నెల నగర్లో విద్యుత్, మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, పలుమార్లు అధికారులకు వెల్లడించిన ఫలితం లేకుండా పోవడంతో ధర్నాకు దిగినట్లు వెల్లడించారు. వెన్నెల నగర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.