కోనసీమ: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా వేటుకూరి సూర్యనారాయణ రాజు సోమవారం మంగళగిరి ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేశారు. అయినవిల్లి మండలం మాగాం గ్రామంకి చెందిన ఆయన బీజేపీ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు చేశారు. ఆయనను మంగళగిరిలో మండల బీజేపీ అధ్యక్షులు వై.వెంకటరమణ, జి.వెంకటేశ్వరరావు, శ్రీనివాస రాజు కలిసి, సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.