AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడులు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తాయని, భారత్పైనా ఆర్థిక ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని తప్పుపట్టి, యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.