KKD: అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ ఆదివారం మృతిచెందాడు. ఏలూరుకు చెందిన బొబ్బా లక్ష్మణ రావు(86) 2025లో భార్యను హత్య చేశాడు. ఈ కేసులో గత ఏడాది జులై నుంచి రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల కిడ్నీ, ఇతర ఆనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు