ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 3 గంటలకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. తాడిపత్రి పట్టణ, రూరల్ మండల నాయకులు నుంచి కార్యకర్తలు ఈ చర్చలో పాల్గొనాలని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతంపై జరగనున్న ఈ భేటీకి అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.