ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) ఇవాళ ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సాయంత్రం బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.