ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పాపాయిగూడెం గ్రామానికి చెందిన పెయింటర్ కందుకూరి శ్రీను (30) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, అన్నం శ్రీనివాస్ ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.