‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆదిత్య ధర్ పరిశ్రమ కింద అణుబాంబు పేల్చారు. ఆ ధాటికి అందరూ అంతరిక్షంలోకి వెళ్లారేమో, అందుకే ఎవరి చప్పట్లు వినిపించట్లేదు. చిత్ర పరిశ్రమ మౌనం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పాత మూస సినిమాలే తీస్తామంటే కుదరదు. తోటి దర్శకులారా.. ఈ సినిమాను ఒక పాఠంలా చదివి, మీ చిత్రాల్లో మార్పులు చేసుకోండి’ అని చురకలు అంటించాడు.