KMM: ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం, వైరాలో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవన్లకు నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గిరిజన విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎంప్లాయిమెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.