సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారులు, ప్రధాన జంక్షన్ల వద్ద ఈ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించకుండా, ప్రాణ భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరారు.