ATP: తాడిపత్రిలోని శివ స్కేటింగ్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి జట్టు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈ పోటీలను రిటైర్డ్ పీడీ శివయ్య, ఎస్ఎన్ఆర్ఎస్ఏ సెక్రటరీ రవిబాల జెండా ఊపి ప్రారంభించారు. అనంతపురం, తాడిపత్రి నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.