MDK: ఏఎంసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంట రాజు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మెదక్ లోని గంట రాజు నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.