NRPT: దామరగిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజార్ (సంత పన్ను వసూలు) వేలం పాట సోమవారం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వేలం దారులు, గ్రామ పెద్దలు ఉదయం 10:30 గంటలకు పంచాయతీ కార్యాలయానికి చేరుకోవాలని కార్యదర్శి రాఘవ సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.