ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ అప్పలనర్స కోరారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. బాలారం నుంచి రాజవొమ్మంగి వరకు రెండు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. వైసీపీ నేతల కబ్జాలో ఉన్న కంఠారం పీహెచ్సీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు.