NDL: బనగానపల్లె సమీపంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం చౌడేశ్వరి మాత ఆలయాల్లో సోమవారం ద్వాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారి సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.