GDWL: ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా ఎంసీహెచ్ అధికారిని డాక్టర్ ప్రసూన రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికలను తక్షణమే ఆన్లైన్ ద్వారా జిల్లాకు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.