AP: నేవీ ఉద్యోగి రవీంద్ర తన స్నేహితురాలు మౌనికను దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖలో జరిగింది. భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఆమెను ఫ్లాట్కు పిలిచి.. చంపి, శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తనను డబ్బుల కోసం వేధించిందని, అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. అయితే యువతి తలభాగం కనిపించలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.