NRPT: ఊట్కూర్ మండలంలోని ఇడ్లూరు గ్రామంలో ఉన్న శ్రీ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన శిలాశాసనం దర్శనమిస్తోంది. ఈ శాసనంపై సూర్యుడు, చంద్రుడు, నంది, శివలింగం చెక్కబడి ఉండగా పాత కన్నడ లిపి స్పష్టంగా కనిపిస్తోంది. శతాబ్దాల క్రితం చెక్కబడిన ఈ శాసనంలో దేవాలయ నిర్మాణం, విరాళాలు, భూమి మరియు ధనం దానాల వివరాలు నమోదు చేసి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.