CTR: సదుం మండలంలోని 79a చింతమాకులపల్లి పంచాయతీ పరిధిలో కారేవాండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం జరగనున్నట్టు ఆలయ ఛైర్మన్ మునినాథ తెలిపారు. ఉదయం సీతారామ, లక్ష్మణ పంచలోహ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, సర్వదర్శనం జరుగుతుందన్నారు. 11 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు.