KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.